ఎంసెట్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్
posted on Aug 8, 2013 9:49PM
ఎంసెట్ కౌన్సిలింగ్కు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. చాలా రోజులు విద్యార్ధులు, తల్లి దండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న కౌన్సింలింగ్కు హైకోర్ట్ ఒకే అంది. ఈ నెల 19 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. దీనికి సంభందించిన నోటిఫికేషన్ కూడా వారం ముందుగా రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది.
వీటితో పాటు యాజమాన్య కోటా సీట్లకు సంబందించిన వివరాల్ని ముందుగానే వెబ్సైట్లో పొందుపరచాలని హైకోర్టు సూచించింది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ కూడా కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 12న కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసేందుకు ఉన్నత విద్యా మండలి రెడీ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎంసెట్ కౌన్సెలింగ్లో ఇంత జాప్యం జరగడం ఇదే మొదటిసారి.