మహారాష్ట్ర, హర్యానాల్లో కొనసాగుతున్న పోలింగ్

 

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ఏడు గంటగలకు ప్రారంభమైంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రధానంగా పంచముఖ పోటీ జరుగుతోంది. 1699 మంది ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 4119 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. 8.25 కోట్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 90 స్థానాలున్న హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 87.37 లక్షల మహిళా ఓటర్లు సహా ఒక కోటీ 63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.