టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం..!

ఎర్రబెల్లి దయాకర్ స్పీకర్ మధుసూధనాచారికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామంటూ.. టీడీఎల్పీని నేతగా మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు టీఆర్ఎస్ లో విలీనమవుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల నుండి పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరారు. ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరి వీరిలో ఎంతమంది ఉంటారో ఎంత మంది జంప్ అవుతారో చూడాలి.