సోనియాగాంధీతో తెరాస నేత భేటీ

 

రాజకీయాల్లో ఒక పార్టీ నేత మరో పార్టీ నేతలను కలిస్తే పార్టీ మారుతున్నారనే వార్తలు చక్కర్లు కొడతాయి.ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే ఆ వార్తలకు ఇంకా బలం చేకూరుతుంది.తెరాస నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) విషయంలో కూడా ఇలాంటి పరిణామాలే జరుగుతున్నాయి.డీఎస్‌ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత.యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ,ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి.అనుకోని పరిణామాలతో తెరాస లో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తూ ఉన్నారు.దీంతో నిజామాబాద్‌కు చెందిన తెరాస నేతలంతా డీఎస్‌పై ఇటీవల తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కవిత సహా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన తెరాస ఎమ్మెల్యేలంతా గతంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అప్పటి నుంచి తెరాస కార్యక్రమాలకు డీఎస్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు.దీంతో పార్టీ మారుతున్నారు అనే వార్తలు వైరల్ అయ్యాయి.దీనికితోడు కొన్నిరోజుల క్రితం డీఎస్‌ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.అయితే పార్టీ మారుతున్నారు అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.కానీ తాజాగా డీఎస్‌ సోనియాగాంధీతో భేటీ అయ్యారు.సోనియాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.డీఎస్‌ పార్టీలో చేరిక గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.సోనియా డీఎస్‌ చేరికపై సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా పార్టీలో చేరితే మహా కూటమిలో పార్టీలను సమన్వయం చేసే భాద్యతలు,కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలను బుజ్జగించే పని కూడా డీఎస్‌ కు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే అధికారికంగా మాత్రం దీనిపై ఎటువంటి సమాచారం లేదు.