రాట్నాన్ని ఆసక్తిగా తిలకించిన ట్రంప్ అండ్ మెలానియా

 

సబర్మతి ఆశ్రమంలో వస్తువులను ట్రంప్ మెలానియా దంపతులు ఆసక్తిగా తిలకించారు. సబర్మతి ఆశ్రమంలో ప్రతి గదినీ దగ్గరుండి చూపించిన మోడీ.... గాంధీజీ వినియోగించిన నూలు వడికే రాట్నం దగ్గర ఎక్కువ సమయం గడిపారు. నూలు వడికే రాట్నం దగ్గర కూర్చొని ఎలా నూలు వడుకుతారో పరిశీలించారు. రాట్నాన్ని తిప్పుతూ నూలు వడికే ప్రయత్నం చేశారు. మెలానియా అయితే, రాట్నాని తిప్పుతూ సంతోషానికి గురైంది. అనంతరం, ఎలా నూలు వడకాలో... ట్రంప్ అండ్ మెలానియాకు అక్కడున్న సబర్మతి సిబ్బంది చేసి చూపించారు. అనంతరం ట్రంప్ కూడా నూలు వడికేందుకు ప్రయత్నించారు. చివరిగా, సబర్మతి ఆశ్రమ బుక్ లో తన అనుభూతులను ట్రంప్ అండ్ మెలానియాలు స్వహస్తాలతో రాశారు. ఆ తర్వాత గాంధీజీ బోధించిన చెడు వినకు... చెడు చూడకు... చెడు మాట్లాడకు... అనే మూడు కోతుల బొమ్మను చూపించి... వివరించారు మోడీ. అనంతరం మొతేరా స్టేడియానిక బయల్దేరి వెళ్లారు.