శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి

 

బ్రహ్మోత్సవాల సందర్భంగా గుండెపోటుకు గురైన ఓఎస్డీ డాలర్ శేషాద్రి కోలుకున్నారు. ఆయన గురువారం నుంచి శ్రీవారి సేవకు పునరంకితమవుతారు. ఈ విషయాన్ని డాలర్ శేషాద్రి తెలియజేస్తూ, ‘‘కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామే నాకు పునర్జన్మ ఇచ్చారు. ఆయన ఆశీస్సులతోనే ప్రాణాలతో బయటపడ్డాను. నేను గుండెపోటుకు గురైన సమయంలో టీటీడీ అధికారులు నాకు ఎంతో అండగా నిలిచారు. వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా స్వామి వారి సేవలో ఉన్నాను. నా జీవితాంతం ఆయన సేవలోనే వుంటాను’’ అన్నారు.