వైసీపీలోకి సీనియర్ డైరెక్టర్..!!

 

సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి త్వరలో వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.  అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ తరుపున ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలొస్తున్నాయి.  విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర  చేస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి కలిశారు. ఆయనతో పాటు నిర్మాత అచ్చిరెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ జగన్‌తో పాటు కొద్దిదూరం నడిచారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో యమలీల, శుభలగ్నం లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చారు. ప్రస్తుతం సినిమా డైరెక్షన్ కి దూరంగా ఉంటున్న ఆయన.. తన మనసును రాజకీయాలవైపు డైవర్ట్ చేసినట్టున్నారు. మరి కృష్ణారెడ్డి త్వరలో వైసీపీలో చేరి చక్రం తిప్పుతారేమో చూద్దాం.