విందే జ‌ర‌గ‌లేదు! మేం ఎలా వెళ్తాం?

జ‌ర‌గ‌ని విందుకు ఎమ్మెల్యేలు వెళ్ళారంటూ కొంత మంది రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ప‌నిగ‌ట్టుకొని విష‌ప్ర‌చారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా వైరస్‌ను రాజకీయాలకు వాడుకోవడం నీచమైన చర్య అని ఆయ‌న‌ మండిపడ్డారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు. గుర్తు పెట్టుకుంటాం. భ‌విష్య‌త్‌లో రాజ‌కీయంగా చూసుకుందామ‌ని అంబ‌టి హెచ్చ‌రించారు.

అసలు విందే జరగలేదని.. జరగని విందుకు తామేలా వెళ్తామని ప్రశ్నించారు. తాన‌తో పాటు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు వెళ్లిన‌ట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. 

తామంతా క్వారంటైన్‌కు వెళ్లాలని ట్రోల్ చేస్తూ రాక్ష‌స ఆనందాన్ని పొందుతున్నార‌ని, నిజంగా క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే.. సామాజిక బాధ్యతగా తాము వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.