తెలంగాణ ప్రక్రియ ఆగలేదు: దిగ్విజయ్

 

 

 

ఏపీ మీడియాకు వార్తల విషయంలో కల్పతరువుగా మారిన దిగ్విజయ్ సింగ్ ఏ రోజుకారోజు టచ్ లో ఉంటున్నారు. తెలంగాణ అంశం గురించి ఏవో ఒక అప్ డేట్స్ ఇస్తున్నారు. నిన్నంతా ఆంటోనీ కమిటీ గురించి మాట్లాడిన దిగ్విజయ్ మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఏదైనా అంశాన్ని టేకప్ చేస్తే.. దాని మీదే కూర్చొనే నేతల్లో దిగ్విజయ్ కూడా ఒకరు.


తాజా దిగ్విజయ్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని అన్నారు సీమాంధ్రులో నిరసనలు తము ప్రభావితం చేయలేదని దిగ్విజయ్ తేల్చిచెప్పారు.. సీమాంధ్రుల సమస్యల అధ్యాయనంపై ఏర్పాటు అయిన ఆంటోని కమిటీ తన పని మంగళవారం నుంచి ప్రారంభిస్తుందని చెప్పారు. ఆంటోనీ కమిటీ అందరి అభ్యంతరాలకు పరిష్కారం చూపుతుందని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ విధేయుడేనని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు దిగ్విజయ్ సింగ్ సూచించారు.