తెలంగాణ పై దిగ్విజయ్ గోల్ మాల్
posted on Jul 27, 2013 10:41AM
తెలంగాణపై శుక్రవారం ఉదయం నుంచి హైడ్రామ నడిపిన కాంగ్రెస్ ఇరు ప్రాంతాల ప్రజలను ఊరించి చివరకు ఎటూ తేల్చలేక మరోసారి వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బలగాలను మోహరిచటంతో ఇక తప్పకుండా ఏదో ఒక ప్రకటన వెలువడుతుందని భావించారు. కోర్ కమిటీ భేటి తరువాత దిగ్విజయ్ సింగ్ ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠగా ఎదురు చూశారు.
దిగ్విజయ్ మాత్రం ... మీరు సిద్ధంగా ఉన్నారా? అని మీడియాతో అంటూ, మధ్యాహ్నం తాను చెప్పినట్లుగా సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని, పార్టీ, యూపిఏ ప్రభుత్వం నిర్ణయం కోసం వేచి వేచిచూద్దామని చెబుతూ వెళ్లిపోయారు. కనీసం సిడబ్ల్యూసీ సమావేశం ఎప్పుడు ఉంటుంది, నిర్ణయం ఎప్పటి లోపు తీసుకుంటారనే విషయం పైన ఆయన మాత్రం స్పందించలేదు.
డిగ్గీ ప్రకటన ఇటు తెలంగాణ నేతలకు అసంతృప్తిని మిగిల్చగా... సీమాంధ్ర నేతలలో మాత్రం ఉత్కంఠను కలిగిస్తోంది. ఆయన ప్రకటన ఇప్పుడు అందర్నీ కన్ఫ్యూజన్లో పడేసింది.