భార్య చనిపోకముందే దిగ్విజయ్ అమృతని ట్రాప్ చేశాడు
posted on Apr 30, 2014 6:01PM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ టీవీ యాంకర్ అమృతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. దిగ్విజయ్ సింగ్ గత కొన్నేళ్ళుగా సాగిస్తున్న రాసలీల వ్యవహారం మీడియాలో ఫొటోల రూపంలో బయటపడింది.
దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ టీవీ యాంకర్ అమృతతో అత్యంత సన్నిహితంగా వున్న ఫొటోలు బయట పడటంతో దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు అమృతను పెళ్ళి చేసుకోబోతున్నానని ప్లేటు ఫిరాయించాడు. దొరికేవరకూ అందరూ దొరలే అన్నట్టు ఇప్పటి వరకూ బుద్ధిమంతుడిలా కనిపించిన దిగ్విజయ్ సింగ్ తన వ్యవహారం బయటపడేసరికి తన అక్రమ సంబంధాన్ని పెళ్ళిద్వారా చట్టబద్ధం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
దిగ్విజయ్ సింగ్ భార్య ఆషా సింగ్ క్యాన్సర్ వ్యాధితో 2013 సంవత్సరం ఏప్రిల్ నెలలో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. భార్య మరణించడానికి ముందు నుంచే దిగ్విజయ్ అమృతతో కనెక్షన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అమృత యాంకర్గా పనిచేస్తున్న రాజ్యసభ ఛానెల్లో కూడా అమృతకు ఉద్యోగం ఇప్పించింది కూడా దిగ్విజయ్ సింగేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమృతతో దిగ్విజయ్ సింగ్కి వున్న వివాహేతర సంబంధం అమృత భర్తకి తెలిసిపోయింది. దాంతో ఆయన విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. అమృతా రాయ్ కూడా విడాకులకు అంగీకరించింది.