చంద్రబాబుతో వైకాపా ఎమ్మెల్యే భేటీ.. ఎందుకంటే..

వైకాపా ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. మంత్రి దేవినేని ఉమతో కలిసి జలీల్‌ ఖాన్‌ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే ఇప్పడు వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. దీంతో జలీల్ ఖాన్ టీడీపీలోకి చేరనున్నట్టు అప్పుడే వార్తలు కూడా షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై దేవినేని ఉమ మాట్లాడుతూ.. తన నియోజన అభివృద్ధి పనుల నిమిత్తం జలీల్ ఖాన్ చంద్రబాబును కలిశారు అంతేకాని దీనిలో రాజకీయ ఉద్దేశం ఏం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు చంద్రబాబు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలనే కలిశారని.. ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా అభివృద్ధే కోరుకుంటున్నారని అన్నారు.