డెంగ్యూకి మొగుడు దొరికాడు

దేశాన్ని వణికిస్తున్న డెంగ్యూ వైరస్‌కు విరుగుడు కనుగొన్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ప్రకటించారు. దాదాపు పదేళ్లపాటు పరిశోధనలు చేసి, డెంగ్యూ వైరస్‌ ను నియంత్రించగల ఔషధాన్ని కనిపెట్టినట్లు తెలిపారు, కలబంద, దానిమ్మపళ్లు, బొప్పాయి ఆకులు, గిలోయ్‌ తీగెల నుంచి తీసిన రసంతో డెంగ్యూ వైరస్‌ను పూర్తిగా అరికట్టవచ్చునని, ఆ నాలుగూ దేశంతటా విస్తారంగా దొరుకుతాయని బాబా చెప్పారు. ఢిల్లీలో కొందరు రోగులకు ఈ మందు వాడటం వల్ల వారంలోపలే డెంగ్యూ పూర్తిగా తగ్గిపోయిందని రాందేవ్‌ వివరించారు. నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయన్న ఆయన, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ లేవని స్పష్టంచేశారు. రోగి పరిస్థితి విషమంగా ఉంటే ప్రతీ రెండు గంటలకోసారి మందు తాగించాలని.. లేదంటే రోజుకు మూడు, నాలుగు సార్లు తాగితే చాలున్నారు. డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, చికున్‌ గున్యా వంటి వ్యాధులపై పదేళ్లుగా విస్తృతంగా పరిశోధనలు నిర్వహించామని, అందులో భాగంగానే ఈ మందును కనిపెట్టినట్లు రాందేవ్ బాబు ప్రకటించారు