హద్దు దాటిన చైనా...

 

భారత్ సరిహద్దు ప్రాంతంలోకి చైనా అప్పుడప్పుడు చొరబాట్లు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి చైనా హ‌ద్దు దాటింది. వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి జ‌మ్ములోని లే జిల్లా డెమ్‌చోక్ ప్రాంతంలోకి చైనా పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ బల‌గాలు చొచ్చుకొచ్చిన‌ట్లు ఓ ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. స‌రిహ‌ద్దులో గ‌స్తీ కాస్తున్న ఇండో టిబిటెన్ బోర్డ‌ర్ పోలీస్ (ఐటీబీపీ) బ‌ల‌గాల‌కు వారు ఎదురు వ‌చ్చారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం వాస్త‌వాధీన రేఖ‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చార‌ని, తిరిగి వెళ్ల‌డానికి వారు నిరాక‌రించార‌ని ఆ అధికారి వివ‌రించారు. 2014లోనూ డెమ్‌చోక్‌లో జ‌రుగుతున్న సాగునీటి ప్రాజెక్టును వ్య‌తిరేకిస్తూ చైనా బ‌ల‌గాలు మ‌న భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. ఈ తాజా చొర‌బాటుపై స్పందించ‌డానికి లే డిప్యూటీ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న రామస్వామి నిరాక‌రించారు.