హద్దు దాటిన చైనా...
posted on Nov 3, 2016 5:10PM
భారత్ సరిహద్దు ప్రాంతంలోకి చైనా అప్పుడప్పుడు చొరబాట్లు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి చైనా హద్దు దాటింది. వాస్తవాధీన రేఖ వెంబడి జమ్ములోని లే జిల్లా డెమ్చోక్ ప్రాంతంలోకి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు చొచ్చుకొచ్చినట్లు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. సరిహద్దులో గస్తీ కాస్తున్న ఇండో టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలకు వారు ఎదురు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం వాస్తవాధీన రేఖకు దగ్గరగా వచ్చారని, తిరిగి వెళ్లడానికి వారు నిరాకరించారని ఆ అధికారి వివరించారు. 2014లోనూ డెమ్చోక్లో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ చైనా బలగాలు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. ఈ తాజా చొరబాటుపై స్పందించడానికి లే డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రామస్వామి నిరాకరించారు.