జంట హత్యల కేసు... యండమూరి దోషి

 

అమెరికాలో రెండేళ్ళ క్రితం తెలుగువారైన సాన్వీ అనే పదినెలల పాపని, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నాని అమెరికాలోనే నివసించే యండమూరి రఘునందన్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. 2012లో అక్టోబర్ 22న పెన్సిల్వేనియాలో ఈ హత్యలు జరిగాయి. అప్పటి నుంచి ఈ కేసు మీద అమెరికాలో విచారణ జరుగుతోంది. ఇద్దరు అమెరికన్ల సహకారంతో యండమూరి రఘునందన్ ఈ హత్యలు చేసినట్టు కోర్టు నిర్ధారించింది. రఘునందన్‌కి ఇంకా శిక్ష ఖరారు చేయాల్సి వుంది. అయితే యండమూరి రఘునందన్‌కి మరణశిక్ష విధించే అవకాశం వుందని తెలుస్తోంది.