ఢిల్లీలో రేప్ కు గురైన నిర్భయకు అమెరికా అవార్డ్

 

ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయకు  అమెరికా ఇచ్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సాహస మహిళా అవార్డు ప్రకటించింది . లైంగిక దాడులను ఎదురోడ్డేవారికి స్ఫూర్తినిచ్చేందుకు మరణానంతరం ఆమెకు ఈ అవార్డు ఇస్తున్నట్లు అమెరికా ప్రథమ మహాల మిషెల్లీ ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఒక ప్రకటనలో ప్రకటించారు. ఈ అవార్డును జ్యోతిసింగ్ పాండే కుటుంబ సభ్యులకు ఫిబ్రవరి 8న నిర్వహించే అంతర్జాతీయ  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందజేయనున్నారు. ఈ అవార్డును అమెరికా ప్రభుత్వం 2007న ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 10 మంది మహిళలకు అందజేస్తారు. ఈ అవార్డును ప్రకటించడంతో జ్యోతిసింగ్ పాండే కుటుంబసభ్యులు తమ హర్షాన్ని ప్రకటించారు.