సునందా పుష్కర్ మృతి.. అసలు ‘విష’యం...

 

కేంద్ర మాజీ, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశి థరూర్ భార్య సునంద పుష్కర్‍ కొద్ది నెలల క్రితం ఢిల్లీలోని ఒక హోటల్ రూమ్‌లో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ఆమె విష ప్రయోగం జరపడం వల్లే మృతి చెందారని పోస్టుమార్టం రిపోర్టు బయటపెట్టింది. సునందా పుష్కర్ భౌతికకాయానికి నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో ఈ విషయం వెల్లడయిందని స్పెషల్ మెడికల్ టీమ్ ప్రకటించింది. న్యూఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులతో ఏర్పాటైన ఈ వైద్యుల బృందం నివేదికను సమర్పించినట్టు సమాచారం. మాజీ మంత్రి శశి థరూర్‌తో పాకిస్థాన్ జర్నలిస్ట్ మెహర్ ప్రేమ వ్యవహారం నడుపుతోందన్న  అనుమానంతో సునందా పుష్కర్, మెహర్‌తో ట్విట్టర్‌లో సంవాదం చేసిన తర్వాత ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్‌ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు.