దూరదర్శన్‌లో ప్రపంచ కప్

 

ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ 2015 క్రికెట్ మ్యాచ్‌లు కేవలం స్టార్ ఛానళ్ళలో మాత్రమే ప్రసారమవుతున్నాయి. భారతదేశానికి చెందిన అధికారిక ఛానల్ దూరదర్శన్‌లో ప్రసారం కావడం లేదు. అందువల్ల కేబుల్ కనెక్షన్ ఉన్నవారు మాత్రమే ఈ మ్యాచ్‌లు చూడగలుగుతున్నారు. డీడీలో మ్యాచ్‌ల ప్రసారానికి స్టార్ ఛానళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దూరదర్శన్‌లో మ్యాచ్‌లు ప్రసారమైతే తమ ఛానెళ్ళు చూసేవారు తగ్గిపోతారని, అది తమకు ఆర్థికంగా నష్టం కలిగిస్తుందని ఆ ఛానళ్ళ వాదన. ఈ నేపథ్యంలో దూరదర్శన్ న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దాంతో కేబుల్ ఆపరేటర్లతో కలసి దూరదర్శన్ ప్రపంచ కప్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు అనుమతిచ్చింది.