బొగ్గు స్కామ్ లో దాసరి పై ఎఫ్‌ఐఆర్‌

 

 

 dasari narayana rao cbi, dasari narayana rao coal scam, coal scam dasari narayana rao

 

 

దేశంలోనే భారీ స్థాయి కుంభకోణాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న బొగ్గుస్కామ్ లో ఏపీ వాటాలు కూడా బయట పడుతున్నాయి. యూపీఏ ప్రభుత్వాన్ని వణికిస్తున్న కోల్ స్కామ్ లో దాసరికి కూడా వాటా ఉందని దాదాపుగా నిర్దారణ అయ్యింది. లక్షా 86 వేల కోట్ల రూపాయల కోల్‌స్కామ్‌లో దాసరి నారాయణరావుపై సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బొగ్గు కేటాయింపుల్లో మంత్రిగా దాసరిపాల్పడిన అక్రమాలకు పక్కా ఆధారాలు దొరికనట్టు తెలుస్తోంది. ఈ కేసులో కూడా సీబీఐ క్విడ్ ప్రోకో కోణాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నవీన్‌ జిందాల్‌ కంపెనీలకు దాసరి బొగ్గు కేటాయింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిగా దాసరి నారాయణరావు కంపెనీ సిరి మీడియాలో నవీన్‌జిందాల్‌ పెట్టబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాసరితో పాటు మరికొంత మంది ప్రముఖుల ఇళ్లలో సోదాలను కూడా నిర్వహించింది సిబిఐ.. కాగ్‌ నివేదిక ఆదారంగా జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకెంత మంది పేర్లు బయట పడతాయో అని భయపడుతుంది కేంద్ర నాయకత్వం..