దాసరిపై సీబీఐ మరో చార్జిషీట్

 

కాంగ్రెస్ హయాంలో కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో అంటుకున్న మసి వదిలే దాఖలాలు కనిపించట్లేదు. లేటెస్ట్ గా దాసరి నారాయణరావుతో పాటు మరో 14 మందిపై సీబీఐ మరో చార్జిషీటు దాఖలు చేసింది. అమరకొండ ముర్గాదంగల్ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో చార్జిషీటు దాఖలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్ సీ గుప్తాలపై కుట్ర, ఛీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రైవేటు లిమిటెడ్ సహా 5 కంపెనీల పేర్లను సీబీఐ చార్జిషీటులో పెట్టారు. ఈ ఛార్జిషీట్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం పరిశీలించనుంది.