ఉత్తమ్ ని కలిసిన దానం.. క్లారిటీ ఇచ్చారు

 

తెలంగాణ సీనియర్ నేత దానం నాగేందర్ ఈమధ్య కాంగ్రెస్ ని వీడి తెరాసలో చేరిన విషయం తెలిసిందే.. అయితే కేసీఆర్ రీసెంట్ గా 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.. ఆ జాబితాలో దానం నాగేందర్ పేరు లేకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి.. అంతేకాదు తనకు కేసీఆర్ టిక్కెట్ కేటాయించకపోవడంతో, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో దానం నాగేందర్ రహస్యంగా కలిశారని కూడా వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయంపై తాజాగా దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు.. తాను ఉత్తమ్‌ను కలవలేదని, కలవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసారు.. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడే ఉంటానన్నారు.. కొంత మంది కావాలనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.. ఎన్నికల బరిలోకి దింపేందుకు అభ్యర్థులు దొరక్కే కాంగ్రెస్ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తోందని దానం విమర్శించారు.