ఎంతపని చేశావ్ తమ్ముడూ:మన్మోహన్ ఆవేదన!
posted on Apr 26, 2014 4:12PM
తనకి తమ్ముడు వరసయ్యే దల్జీత్ సింగ్ కోహ్లీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి మోడీ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరడం తనకెంతో బాధని కలిగిస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. దేశంలో మోడీ హవాలాంటిదేమీ లేదని మన్మోహన్ సింగ్ ప్రకటించిన మర్నాడే ఆయన తమ్ముడు బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి, మన్మోహన్ సింగ్కి షాక్ ఇచ్చింది. ఈ సంఘటన మన్మోహన్కి షాక్ ఇచ్చిందని ఒప్పుకుంటున్న ప్రధాని కార్యాలయ వర్గాలు మళ్ళీ తమాయించుకుని దల్జీత్సింగ్ మన్మోహన్కి సొంత తమ్ముడేమీ కాదు.. చాలాకాలంగా మన్మోహన్తో ఆయనకి సంబంధాలు లేవు అని కవర్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ అంశం మీద ఎలాగూ ప్రధాని కార్యాలయం స్పందించింది కాబట్టి ఇక మన్మోహన్ స్పందించరని అందరూ అనుకున్నారు. అయితే మన్మోహన్ సింగ్ కూడా స్పందించారు. ఇది విచారకరమైన సంఘటన అని ఆయన అన్నారు. తాను ఎవరినీ నియంత్రించే పరిస్థితిలో లేనని చెప్పారు. నిజమేగా!