హుదూద్ తుఫాను వచ్చేస్తోంది

 

2013 సంవత్సరం అక్టోబర్‌లో వచ్చిన పైలీన్ తుఫాను కంటే ఇప్పుడు దూసుకువస్తున్న ‘హుదూద్’ తుఫాను ఇంకా బీభత్సంగా వుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హుదూద్ ప్రభావంతో గాలి వేగం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. హుదూద్ ప్రభావంతో శుక్రవారం నాడు ఉత్తరాంధ్రలో ఈదురుగాలులు, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి హుదూద్ తుఫాను విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య ఏదో ఒక ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం హుదూద్ తుఫాను విశాఖపట్నానికి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.దీని ప్రభావంతో సముద్రం రెండు మూడు అడుగులు ముందుకు రావచ్చని చెబుతున్నారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉండబోతోంది.