కావూరి ర్యాలీలో అపశ్రుతి: ఓ వ్యక్తి మృతి

 

Crackers blast kavuri rally, Fire Accident  kavuri Rally

 

కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ర్యాలీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కేంద్రమంత్రిగా భాద్యతలు తీసుకున్న తరువాత కావూరి తొలిసారి తన సొంత జిల్లాకు వస్తుండడంతో, గన్నవరం ఎయిర్‌పోర్టులో కృష్ణా జిల్లా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సంధర్బంగా కార్యకర్తలు బాణాసంచా పేలుస్తుండగా నిప్పు రవ్వలు బాణాసంచాతో వెళ్తున్న ఆటోలో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఆటోలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలైన మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బయలు దేరిన కావూరి కాన్వాయ్‌ను హనుమాన్‌జంక్షన్ వద్ద టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని పరిస్థితిని అదుపుచేశారు.