బాణాసంచా పేలుళ్ళు... 11 మంది మృతి

 

తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లిలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదకొండు మంది వ్యక్తులు మరణించారు. మృతులందరూ మహిళలే. ఈ బాణాసంచా తయారీ కేంద్రానికి ఎలాంటి అనుమతి లేదని, కొంతమంది వ్యక్తులు స్థానికంగా బాణాసంచా తయారు చేస్తూ వుండగా ఈ భారీ పేలుడు సంభవించినట్టు సమాచారం. బాణసంచా పేలుడు జరిగిన ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. వాటిని అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేసి లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.