కడుపులో బిడ్డకు కరోనా.. 

దేశంలో కరోనా అందర్నీ దత్తత తీసుకుంటుంది.. మొన్నటి వరకు చాల మంది సెలబ్రెటీలు కరోనా భారీన పడ్డారు.  తాజాగా మొదటి సారి అప్పుడు పుట్టిన పసి బిడ్డకు కూడా కరోనా సోకిందని తెలిపారు డాక్టర్స్. ఇలాంటి కేసు రావడం ఫస్ట్ టైం అని కూడా చెప్పారు.  

ఆమె నిండు గర్భిణీ. తొలుత ఆమె భర్తకు కరోనా వచ్చింది. ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెకూ పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు వచ్చాయి. పలు ఆసుపత్రులకు తిరిగారు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆమెను చేర్చుకునేందుకు అంగీకరించలేదు. చివరకు ఆయుష్మాన్ భవ్ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకుని ప్రసవం చేసింది.

కట్ చేస్తే.. అప్పుడే పుట్టిన బిడ్డకూ కరోనా ఉన్నట్టు గుర్తించి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. హర్యానాలో ఇలాంటి కేసు రావడం ఇదే తొలిసారి అని ప్రసవం చేసిన డాక్టర్ చెప్పారు. కడుపులో ఉండగానే బిడ్డకు కరోనా సోకడం చాలా అరుదని వివరించారు.  

తల్లి నుంచి కడుపులోని బిడ్డకూ కరోనా వైరస్ సోకిన అరుదైన ఘటన హర్యానాలో జరిగింది. ఇప్పటిదాకా తల్లి కడుపులోని బిడ్డకు కరోనా సోకదని చాలా మంది నిపుణులు చెప్పారు. అలా పుట్టే పిల్లలు చాలా అరుదు అని వివరించారు. తాజాగా హర్యానాలోని ఆయుష్మాన్ భవ్ అనే ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ ఉన్న ఓ మహిళ కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది.