ఏపీలో 161కి పెరిగిన కేసులు!

12 కొత్త కేసులు నమోదు
గత రాత్రి నుంచి ఈ ఉదయం వరకూ పాజిటివ్
ట్విట్టర్ లో వెల్లడించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాత్రి 10 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల్లోపు 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యాంధ్ర, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "రాష్ట్రం లో గత రాత్రి 10 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు వచ్చిన ఫలితాలలో 12 పాజిటివ్ కేసు లు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్ - 19  కేసుల సంఖ్య 161 కి పెరిగింది" అని పేర్కొంది.