భారత్ లో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 19,148 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 434 మంది మరణించారు. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,04,641కి చేరగా, మృతుల సంఖ్య 17,834కి చేరింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,59,860 మంది కోలుకోగా, ప్రస్తుతం  2,26,947 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,80,298 కరోనా కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 8,053 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇక, ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మరింత పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,08,03,599 కరోనా‌ కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 5,18,968కి చేరుకుంది. ఇప్పటివరకు  64,57,985 మంది కరోనా నుంచి కోలుకోగా,, ప్రస్తుతం 43,45,614 యాక్టివ్ కేసులు ఉన్నాయి.