‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ రూపకర్త ‌మృతి

 

ఈమధ్య కాలంలో ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ అనే విరాళాల సేకరణ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం, ఆదరణ పొందుతోంది. తాజాగా హాలీవుడ్, బాలీవుడ్ తాలతోపాటు దక్షిణాదికి చెందిన తారలు కూడా ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా అక్షయ్ కుమార్, హన్సిక తదితరులు కూడా పాల్గొన్నారు. అయితే విషాదమేమిటంటే, ఇంత ఆదరణ పొందుతున్న ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ రూపకర్త కోరె గ్రిఫిన్ ఆగస్టు 16న మసాచుసెట్స్ లోని నాంటుకెట్ సముద్ర తీరంలో జరిగిన ఒక ప్రమాదంలో సముద్రంలో మునిగి చనిపోయారు. డైవింగ్ చేస్తుండగా సముద్రంలో మునిగి ఆయన చనిపోయారు. గ్రిఫిన్ వయసు కేవలం 27 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులోనేప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించుకున్న ఆయన అనుకోని ప్రమాదంలో చనిపోవడం విషాదం. గురువారం నాడు ఆయన సంస్మరణ సభ జరిగింది. కపాలానికి సంబంధించిన తన స్నేహితుడి సహాయార్థం గ్రిఫిన్ ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని రూపొందించాడు. గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం ఆన్లైన్ లో హల్ చల్ చేస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’లో పాల్గొంటున్నారు. తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు.