కాంగ్రెస్‌లో ఆత్మస్థైర్యం క్షీణిస్తోంది: చిదంబరం

 

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో వుంది. అసలే కేంద్రంలో అధికారం పోయి అల్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ‘హస్తం’ నుంచి రాష్ట్రాలు కూడా చేజారిపోతూ వుండటంతో ఇంతకాలం దేశంలో హవా నడిపిన కాంగ్రెస్ నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలాంటి నాయకుల జాబితాలో ఇప్పుడు చిదంబరం కూడా చేరారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోందని, పార్టీ అధినాయకత్వం ఈ విషయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతోపాటు సోషల్ మీడియాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరింత చేరువ కావాలని సూచించారు. స్విస్ బ్యాంకు నల్లధనం జాబితాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తుల పేర్లు ఉన్నప్పటికీ పార్టీకి ఎలాంటి ఇబ్బందీ లేదని చిదంబరం చెప్పారు. ఆ జాబితాలో పార్టీలో ఏ స్థాయి వ్యక్తులు వున్నా తాము పట్టించుకోమని అన్నారు.