తెలంగాణలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్

 

congress vijayashanti, telangana congress

 

 

రాబోయే సాధారణ ఎన్నికలలో తెరాసకు పది లేదా పదకొండు సీట్లు మాత్రమే వస్తాయని, కాంగ్రెసు పార్టీకి ఎనబై సీట్ల వరకు వస్తాయని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందన్నారు. ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే అది టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఒక్కరిది కాదని, అమరవీరులతో పాటు తామందరిదని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. 16 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. నేనేంటో రాష్ట్రంలోనేకాక, దేశంలో అందరికీ తెలుసునని, షోకాజ్ నోటీసు వచ్చిన తర్వాతే తన అభిమానులతో చర్చించి భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం తీసుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు.