కాంగ్రెస్ లోకి మాజీలు

 

 

 

తెలంగాణ ఉద్యమం ఉదృతమైన అనేక సార్లు కేసీఆర్ ఆటంకం కలిగించారని మాజీ మంత్రి విజయ రామారావు ఆరోపించారు. సోమవారం ఉదయం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు అండగా ఉండాలనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేశామని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం చేస్తారని భావిస్తున్నామన్నారు. తెలంగాణ వస్తే దళితులకు న్యాయం జరుగుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీమాంధ్రలో ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్‌కు అండగా నిలవాలని భావిస్తున్నామని మరోనేత విజయరామారావు చెప్పారు.