కాంగ్రెస్ సిగ్గొదిలేసింది!

 

 

 

మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో వున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గును పూర్తిగా వదిలేసిన లక్షణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇస్తే తెరాసని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఆ మాట తప్పినా కాంగ్రెస్‌కి బుద్ధి రాలేదు. గత కొంతకాలంగా కాంగ్రెస్, తెరాస నాయకులు ఒకరినొకరు బండబూతులు తిట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్లలో, మీటింగ్స్ లో కాంగ్రెస్ పార్టీని తిట్ల దండకంతో కడిగేస్తున్నాడు. లేటెస్ట్ గా మెదక్ జిల్లాలో జరిగిన మీటింగ్‌లో కూడా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని నానా మాటలతో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. కేసీఆర్ తిట్లకి ప్రతీకారంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా కేసీఆర్‌ మీద మాటల దాడి చేశాడు. ఇదంతా ఓకే.. ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్‌ని రకరకాలుగా విమర్శించిన పొన్నాల ఆ తర్వాత తెరాసతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా వుందని, కేసీఆర్ ఒప్పుకుంటే రెండు పార్టీలు జట్టు కట్టి తెలంగాణని ఉద్ధరించేద్దామని అన్నాడు. ఒకవైపు కేసీఆర్ ఛీ పో అంటున్నా తెరాసతో పొత్తు కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీలో ‘సిగ్గు’ అనే పదార్ధం లేనట్టే కదా!