కోర్ కమిటీలో తెలంగాణ పై నిర్ణయం?

 

congress telangana, sonia gandi digvijay singh, digvijay singh sonia gandi

 

 

రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పార్టీ అదినేత్రి సోనియాగాంధీతో బేటీ ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రూపొందించిన నివేదికను ఈ సంధర్బంగా ఆయన సోనియాగాంధీ కి అందజేశారని సమాచారం. ఈ నివేదిక ఆధారంగా కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణాపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయానికి వచ్చే అవకాశంమున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్న దిగ్విజయ్ కేంద్ర హోం మంత్రి షిండేతో కూడా సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. కోర్ కమిటీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా రాష్ట్ర నేతల నుంచి కూడా రోడ్ మ్యాప్ లు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. సోనియాతో భేటీకి ముందు దిగ్విజయ్ సింగ్ రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తికరంగా ఉంది.