పోలింగ్‌లో అడ్రస్ లేని కాంగ్రెస్

 

 

 

సీమాంధ్రలో పోలింగ్ చకచకా జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. వైకాపా ఓటర్లను ప్రలోభపరచడానికి ఎన్ని తంత్రాలు, కుతంత్రాలు ప్రయోగించినా ఓటర్ల నాడి తెలుగుదేశం, బీజేపీ కూటమికి అనుకూలంగా వున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితులన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వుండటం చూసి తట్టుకోలేని వైకాపా శ్రేణులు సీమాంధ్ర వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నాయి. చివరకి ఎన్నిక సిబ్బంది మీద కూడా దాటి చేయడానికి వైకాపా వర్గాలు సాహసించాయి. ఇదిలా వుంటే ఒకవైపు తెలుగుదేశం హవా వీస్తుంటే, మరోవైపు వైకాపా అరాచకత్వం పోలింగ్ సందర్భంగా కనిపిస్తోంది. ఈ రెండిటి మధ్య కాంగ్రెస్ ఊసు కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్న ఓటర్లు కనిపించడం లేదు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనిపించడం లేదంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.