కేసీఆర్ తో రాజయ్య కటీఫ్

 

 

congress rajaiah, kcr rajaiah, congress mp rajaiah, rajaiah telangana

 

 

కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రాజయ్య టీఆర్ఎస్ లో చేరడంపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. వరంగల్ ఎంపీ టిక్కెట్ కోసం ఆయన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎంపీ టిక్కెట్పై టీఆర్ఎస్ హామీ ఇవ్వకపోవటంతో వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆయనకు మానకొండూరు అసెంబ్లీ టిక్కెట్ను ఆఫర్ చేస్తోంది. కాగా మరోవైపు పౌరసరఫరాల శాఖమంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ను వీడొద్దంటూ రాజయ్యకు నచ్చచెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరికి వరంగల్ పార్లమెంటు స్థానంపై కెసిఆర్ హామీ ఇచ్చారు. మానకొండూరు సీటు కోసం పలువురు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజయ్యకు కెసిఆర్ నుండి హామీ రాలేదని సమాచారం. దీంతో టీఆర్ఎస్ లోకి వెళ్తే వచ్చేదేమీ లేదని భావించిన రాజయ్య కాంగ్రెసులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.