పీసీపీ, టీ పీసీసీ అధ్యక్షుల దారుణ ఓటమి

 

 

 

అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దరిద్రం పట్టింది. తెలంగాణ ఇచ్చిన పాపానికి సీమాంధ్రలో, తెలంగాణ ఇచ్చినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది. తెలంగాణ అని గొంతు చించుకుని అరిచిన కాంగ్రెస్ నాయకులు చాలామంది తెలంగాణలో ఓడిపోయారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోగానీ, పార్లమెంట్‌లో గానీ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఓడిపోయారు. సీమాంధ్రలో కూడా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఓడిపోయారు.