కోర్టుకు హాజరైన రాహుల్

ఆర్ఎస్ఎస్‌ పరువు నష్టం కేసులో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ ముంబైలోని బివండి కోర్టుకు హాజరయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014 మార్చి 6న బీవండిలోని ఓ బహిరంగసభలో రాహుల్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ కోర్టును ఆశ్రయించింది..తమ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పరువు నష్టం దావా వేసింది. ఈ నేపథ్యంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలన్న కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇవాళ బీవండిలోని న్యాయస్థానానికి వచ్చారు.