రెబల్ ఎమ్మెల్యేల ధిక్కారం: వేటు వేయండి

 

 congress mlas, Nadendla Manohar, jagan parti mlas, congress ysr congress

 

 

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా విప్ ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ విచారణ ప్రారంభించారు. న్యాయవాదితో కలిసి ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే విప్‌ను ధిక్కరించిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు దూరంగా ఉన్నారు. ఫ్యాక్స్ ద్వారా తమ వివరణను స్పీకర్ కార్యాలయానికి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేశ్, నాని పంపారు. తక్షణమే తమపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. విచారణకు ఈ రోజు హాజరుకావాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తమ మీద వేటు వేయాలని ఇంతకుముందే ఆయనను కలిసి కోరామని, ఇప్పుడు మళ్లీ విచారణకు హాజరు కావడం ఎందుకు ? అని వారు అంటున్నారు. నోటీసులతో కాలయాపన చేయకుండా విప్‌ను ధిక్కరించినందుకు తమై వేటు వేయండి అని ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. అవిశ్వాసానికి అనుకూలంగా స్పీకర్ సమక్షంలోనే ఓటు వేశామని గుర్తు చేశారు. మళ్లీ వివరణ ఎందుకని ప్రశ్నించారు. స్పీకర్‌కు వివరణ ఇస్తూ గతంలోనే బహిరంగ లేఖ రాశామని అన్నారు.