వీసీ శుక్లా కన్నుమూత

 

 

Congress leader VC Shukla dead, V C Shukla former Union minister dies, VC Shukla

 

 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా కన్నుమూశారు. గత నెల 25వ తేదీన ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన శుక్లా ఢిల్లీలోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన మృతికి ప్రముఖ నేతలు సంతాపం తెలియజేశారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తమ ప్రగాఢ సంతాపం తెలుపుతూ, శుక్లా కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. 1966లో ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు.వీసీ శుక్లా తొమ్మిది సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.