కాంగ్రెస్ ఎత్తుకి బీజేపీ చిత్తు కాబోతోందా?

 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కోక మునుపే, అవసరమయితే థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్వీరాజ్ చవాన్ ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని అంగీకరిస్తున్నట్లేనని బీజేపీ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రకటన వెనుక బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే దురాలోచన కూడా ఉందని, అందుకే ఆ పార్టీతో రహస్య ఒప్పందం ఉన్న తెరాస వంటి పార్టీలు ఎన్నికల తరువాత థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తామని కొత్త పాట అందుకొన్నాయని, అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల తరువాత ఏ కూటమికి మద్దతు ఇస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. కొన్ని రోజుల క్రితం వరకు థర్డ్ ఫ్రంట్ ని చాలా తేలికగా తీసుకొన్న బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ వేస్తున్న కొత్త ఎత్తుతో చాలా కంగారు పడుతోందని వెంకయ్య మాటలు స్పష్టం చేస్తున్నాయి.