బొగ్గు స్కామ్.. దాసరిని ప్రశ్నించిన ఇ.డి.

 

దేశాన్ని కుదిపేసిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో పాత్రధారులుగా అనుమానిస్తున్న అందరినీ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో బొగ్గు కుంభకోణం జరిగిన సమయంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు పీటీఐ ఒక కథనాన్ని వెల్లడించింది. ఈ బొగ్గు కుంభకోణం కేసులో గతంలో కూడా ఆయన  విచారణను ఎదుర్కొన్నారు.