మోడీ లంచం తీసుకున్నారు...సాక్ష్యాలు ఇవే..

 

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీ పై మరోసారి మండిపడ్డారు. మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన దగ్గర నుండి కేజ్రీవాల్ మోడీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఆజాద్ పూర్ మండీ వద్ద పెద్ద నోట్ల రద్దుపై నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ మంచివారని దేశ ప్రజల్లాగే తాను కూడా నమ్మానని.. యితే ఓ సారి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కు దొరికిన పత్రాల్లో ఎవరూ ఊహించని వాస్తవాలు వెల్లడయ్యాయని ఆయన చెప్పారు. బిర్లా సంస్థ ప్రధాని నరేంద్ర మోదీకి 12 కోట్ల రూపాయలు లంచం ఇచ్చిందని..  అలాగే సహారా ఇండియా సంస్థ కూడా ప్రధానికి కోట్ల రూపాయల లంచం ఇచ్చిందని ఇవన్నీ నిజమేనని నిర్ధారించుకున్న తరువాత వాటి గురించి మాట్లాడుతున్నానని ఆయన చెప్పారు.ఇందుకు సంబంధించిన సాక్ష్యాల పత్రాలను కూడా ఆయన ప్రదర్శించారు.