ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీగా తెలంగాణా రాష్ట్రం!
posted on Mar 29, 2020 8:25PM
తెలంగాణలో ఇప్పటివరకు 70 మంది కరోనా బారిన పడ్డారు. వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 11మందికి కరోనా నయమైంది. మార్చి 29 ఆదివారం నాడు చేసిన పరీక్షల్లో 11మందికి నెగిటివ్ వచ్చింది. రేపు వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారని తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. తెలంగాణలో తొలి కరోనా బాధితుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న 76 ఏళ్ళ వృధ్దుడు కరోనాతో చనిపోయారు. ఈ రోజు కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం సి.ఎం. చెప్పారు.