రుణమాఫీ ఆంక్షలు: గుండెపోటుతో రైతు మృతి!

 

 

 

టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రైతు నిండు ప్రాణాన్ని తీసింది. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రైతుల రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే తమ రుణాలన్నీ మాఫీ చేస్తాడు, తమ కష్టాలన్నీ తీరుస్తాడని ఆశగా ఎదురు చూసిన రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. మంచినీళ్ళు తాగినంత ఈజీగా మాట తప్పే కేసీఆర్ రైతుల రుణమాఫీ విషయంలో కూడా తన టాలెంట్ ప్రదర్శించారు. రైతుల రుణ మాఫీ పాయింట్ మీద బోలెడన్ని మెలికలు పెట్టారు. దాంతో రైతులు షాకయ్యారు. తమ బతుకులు ఇలా అప్పుల్లో కూరుకుపోవలసిందేనని బాధపడ్డారు. కేసీఆర్ తన రుణం మాఫీ చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఒక రైతు కేసీఆర్ ఇచ్చిన షాక్‌తో ఆవేదన చెంది గుండెపోటుతో మరణించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం కాశీపూర్‌ గ్రామానికి చెందిన భద్రన్న అనే రైతు గుండెపోటుతో మరణించారు. భద్రన్న ప్రాణాలు పోవడానికి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌కి రైతుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.