మోడీతో కేసీఆర్ బేటీ...

సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి భేటీ అయిన సందర్భాలు చాలా తక్కువ. రాష్ట్ర విభజన తరువాత అయితే కేసీఆర్ కేంద్రానికి కాస్త దూరంగా ఉన్నారనే చెప్పొచ్చు. ఇక ప్రధాని మోడీ కూడా కేసీఆర్ ఎప్పుడు ఆపాయింట్ మెంట్ కోరినా ఆయనకు కలిసే ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు చాలా కాలం తరువాత కేసీఆర్ మోడీతో ఈరోజు భేటీ కానున్నారు. మూడ్రోజుల పర్యటన నిమిత్తం సీఎం నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారు రాష్ర్టానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు తదితర అంశాల గురించి చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు రెండో దశ పనులను ప్రారంభించాలని ఆహ్వానించడంతోపాటు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా మోదీని కేసీఆర్ ఆహ్వానించనున్నారు.