జయలలిత గది మార్పు..

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత కొద్ది రోజులుగా చెన్నైలోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదట హెల్త్ బులిటెన్లు విడుదల చేసినా.. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కాస్త కుదుటపడిన నేపథ్యంలో బులిటెన్లు ఇవ్వడం కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం గురించి మరోసారి తెలిపారు అన్నాడీఎంకే నేతలు. అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ మాట్లాడుతూ.. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను  క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ) నుంచి వేరే గదిలోకి మారుస్తున్నారని తెలిపారు. గత వారం రోజులుగా ఆమెకు ఒక మాదిరి ఘన ఆహార పదార్థాలను ఇస్తున్నారన్నారు. ఇప్పుడు ఆమె అందరితో మాట్లాడుతున్నారని కూడా తెలిపారు.