కిరణ్ కు తెలంగాణ సెగ: రాళ్ల వర్షం, ఉద్రిక్తత

 

 

 

ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ఫై వరంగల్ జిల్లా బొమ్మకూరులో తెలంగాణా వాదులు రాళ్ళతో దాడి చేశారు. కాకతీయ ఉత్సవాల ప్రారంభానికి సిఎం అక్కడికి చేరుకున్నారు.

 

బొమ్మకూరు లో ఏర్పాటు చేసిన సభ స్థలానికి కిరణ్ వెళ్తుండగా, ఆయన కాన్వాయ్ ను తెలంగాణా వాదులు మధ్యలోనే అడ్డుకున్నారు. ప్రభుత్వానికి, సిఎం కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. తెలంగాణా ఫై స్పష్టత ఇవ్వాలని వారు సిఎం కాన్వాయ్ ని చుట్టుముట్టారు.

 

ఈ రాళ్ళ దాడిలో కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు దెబ్బ తిన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాటీ లకు పని చెప్పాల్సి వచ్చింది. దీనితో కొంచెం సేపు అక్కడ ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్ల ఫై ముఖ్య మంత్రి అధికారులను మందలించినట్లు సమాచారం.