మంటల్లో కాలిపోయిన ముఖ్యమంత్రి హెలికాప్టర్
posted on Dec 18, 2012 11:29AM
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఎయిర్ పోర్ట్ లో కొన్ని విమానాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఎయిర్ పోర్ట్ రోడ్డులో ఎయిర్ క్రాఫ్ట్ పార్కింగ్ చేసే హ్యంగర్స్ కు మంటలు రేగాయి. అందులో ఇంధనం కూడా ఉండడంతో మంటలు మిగతా బాగాలకు వేగంగా వ్యాపించాయి. మంటలు ఎగిసిపడి పేలుళ్లు జరగడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఇళ్ల నుండి బయటకు వచ్చారు.
ఈ ప్రమాదంలో రెండు ప్రభుత్వ, రెండు ప్రైవేటు విమానాలతో పాటు ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్ కూడా మంటల్లో కాలిపోయింది. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం పూర్తయ్యాక ఇక్కడ నుండి ఎలాంటి రాకపోకలు లేవు. ప్రధాని, ముఖ్యమంత్రి లాంటి ప్రముఖులు రాకపోకలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఇక పలు విమానాలు, చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లను ఇక్కడ నిలిపి ఉంచుతున్నారు.