చంద్రబాబు కోర్టుకు హాజరుకావల్సిందే..!!

 

బాబ్లీ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కేసులో విచారణను మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు వాయిదా వేసింది.. ఏపీ సీఎం చంద్రబాబుకు జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌పైన కోర్టులో వాదనలు జరిగాయి.. ఆయన తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ సుబ్బారావు వాయిదా కోరారు.. నోటీసులు అందుకున్న వారు ఎందుకు హాజరుకాలేదంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.. ముఖ్యమంత్రి అయినా, సామాన్యులైనా న్యాయస్థానం ఆదేశాలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు.. దీనికి చంద్రబాబు తరపు న్యాయవాది స్పందిస్తూ కోర్టుకు హాజరయ్యేందుకు సమయం కోరారు.. దీంతో న్యాయస్థానం కేసు విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది.. ఈ కేసులో నోటీసులు అందుకున్న చంద్రబాబుతో సహా 16 మంది ఆ రోజు  తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.. మరోవైపు ఇదే కేసులో తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, ప్రకాష్ గౌడ్‌, రత్నంకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.. వారి ముగ్గురికి రూ.5వేల చొప్పున జరిమానా విధించింది.